పాక్ తో మరోసారి జతకట్టిన టర్కీ
ఆగస్టు 14న పాకిస్థాన్ 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. ఈ మేరకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఆర్మీ పరేడ్ జరిగింది. ఈ పరేడ్ లో పాకిస్థాన్ సైనికులతో పాటు టర్కీ, అజర్ బైజాన్ దేశాల సైనికులు సైతం పాల్గొన్నారు. కవాతు నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతిదాడిగా భారత్ పై పాకిస్థాన్ వందల కొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ తో విధ్వంసానికి పాల్పడింది.